భాద్రపద శుక్ల పక్ష తదియనాడు హరితాళిక వ్రతం , లేదా సువర్ణ గౌరీ వ్రతం , పదహారు కుడుముల తద్ది’* ఆచరిస్తారు. శివపార్వతులను పూజించి , పదహారు కుడుములను తయారుచేసి నైవేద్యంగా సమర్పించవలెను. ఈ పూజను కన్యలు పాటించడంవల్ల వారికి మంచి భర్త లభిస్తాడు. ముత్తయిదువలు పాటించడంవల్ల వారి సౌభాగ్యం అభివృద్ధి చెందుతుందని శాస్త్ర వచనం. హరితాళిక వ్రతం విశిష్టత కైలాస శిఖరమందు పార్వతి ఒకనాడు పరమశివుడిని ఇలా అడిగింది *“స్వామీ ! తక్కువ శ్రమతో , ధర్మాచరణతో ఎవరు నిను భక్తి శ్రద్ధలతో సేవిస్తారో వారికెలా ప్రసన్నుడవౌతావో తెలుపుమని ప్రార్థించింది. అంతేకాక , జగవూత్పభువైన మీరు నాకు యే తపోదాన వ్రతమాచరించుటచే లభించారు” అని అడిగింది. ప్రసన్నవదనంతో పరమశివుడు ‘‘దేవీ ! వ్రతాల్లోకి చాలా ఉత్తమమైంది , అత్యంత రహస్యమైన వ్రతమొకటున్నది. దాన్నెవరాచరించినా నేను వారికి వశుడనైతాను. భాద్రపద శుక్లపక్షంలో హస్తనక్షవూతంతో కూడిన తదియ యందు వ్రతాన్నాచరించినవారు సర్వపాప విముక్తులవుతారు. ‘‘దేవీ ! నీవు నీ చిన్ననాట హిమాలయాల్లో ఈ మహా వ్రతాన్ని ఎలా ఆచరించాలో చెబుతాను. విను !” అన్నాడు. భూలోకమున వివిధ పక్షులతో , విచిత్ర మృగాలతో మంచుచేత కప్పబడి బహుసుం...